రాజకీయ భవిష్యత్‌పై కేకే కుమారుడి సంచలన ప్రకటన

by Disha Web Desk 2 |
రాజకీయ భవిష్యత్‌పై కేకే కుమారుడి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ భవిష్యత్‌పై రాజ్యసభ సభ్యుడైన కే.కేశవరావు కుమారుడు విప్లవ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. తండ్రి కేకే కాంగ్రెస్‌లో చేరబోతున్నాడన్న వార్తలు విస్తృతమైన నేపథ్యంలో విప్లవ్ కుమార్ గురువారం ప్రెస్‌నోట్ విడుదల చేశారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఈ సందర్భంగా ప్రకటించారు. పార్టీ మారే ప్రసక్తే లేదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందని వెల్లడించారు. మరోవైపు ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేకేతో కేసీఆర్ జరిపిన చర్చలు విఫలం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ చేరడం ఖాయమని కేసీఆర్‌కు కేకే తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీలో మీకేం తక్కువ చేశామని కేకేపైన కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని అక్కడున్న బీఆర్ఎస్ నేతల ద్వారా తెలిసింది.


Next Story

Most Viewed