మహేష్ బాబు హీరో కాదు విలన్.. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
మహేష్ బాబు హీరో కాదు విలన్.. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నల్లగొండ: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుపై తెలంగాణ టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లా్క్ టవర్ సెంటర్ వద్ద తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, తెలంగాణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడారు. ముందుగా అందరికీ నూతన ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది అనేది ప్రకృతి పండుగ అన్నారు. నేడు కొత్త మంది పండుగ రోజున ఆశాస్త్రీయ విధానం పాటిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జనవిజ్ఞాన వేదిక వారు, టీఎస్ యూటీఎఫ్ వారు గత పదేళ్లుగా సహజ పానీయాలు తాగాలని తెలుపుతూ అందరికీ అవగాహన కల్పించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్సీ అభినందించారు.

అనంతరం హీరో మహేష్ బాబు హీరో కాదు విలన్ అని షాకింగ్ కామెంట్ చేశారు. మహేష్ బాబు ఎక్కువగా హానికరమైన కూల్ డ్రింక్స్‌కు యాడ్స్ చేస్తూ కృతిమ పానీయాలకు యాడ్ ఎజెంట్స్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. సమాజానికి చెడు చేసే ప్రకటనల్లో భాగస్వామ్యం అవుతున్నారని మండిపడ్డారు. ఇకనైనా మహేష్ బాబు అలాంటి యాడ్స్‌లో కనిపించకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రకృతి పానీయాలు నిమ్మరసం, కొబ్బరినీరు, చెరుకు రసం, మజ్జిగ, రాగి జావా, పండ్ల రసాలు ప్రకృతి సిద్ధమైన పానీయాలు మాత్రమే తాగాలన్నారు. కృతిమ పానీయాలైన కూల్ డ్రింక్స్ తాగొద్దని చెప్పారు. తెలిసి ఆరోగ్యానికి ప్రమాదంలోకి నెట్టొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, నాయకులు ప్రధాన కార్యదర్శి రవి, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమల్ల వెంకటేశం, జిల్లా కార్యదర్శి నలుపరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed