బీజేపీలోకి TRS ఎమ్మెల్యేలు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
బీజేపీలోకి TRS ఎమ్మెల్యేలు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ అనే కుండకు రంద్రం కొట్టిందే నేనని అలాంటిది తానెందుకు ఆ పార్టీలోకి వెళ్తానని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శనివారం నల్గొండలో మాట్లాడిన ఆయన తాను పార్టీ మారుతాననంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే నావ అని అందులో చేరబోయేది లేదని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తారనని హెచ్చరించారు. తనపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్రను ఆంపిందే నేను. బీజేపీని వీడుతున్న వారంతా తమ అవసరాల కోసమే వెళ్తున్నారని చెప్పారు. బీజేపీని వీడి టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నవారి మనసులు మాతోనే ఉంటాయని అసలు వెళ్తున్న వాళ్లని మేమే పంపి ఉండొచ్చుకదా? అని అన్నారు. టీఆర్ఎస్‌కు కాదని బీజేపీలోకి వచ్చే వారి సమాచారం తమ వద్దకంటే కేసీఆర్ వద్దే ఎక్కువ ఉందన్నారు. తెలంగాణ పోలీసులు తమ ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరు చొప్పున టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed