- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర్ రెడ్డి: కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(Katipally Venkata Ramana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డిలో అవినీతి లేని పాలన చేస్తున్నానని అన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేని షబ్బీర్ అలీ.. రెచ్చిపోయి ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని మండిపడ్డారు. నాకు రాజకీయ భిక్ష పెట్టానని షబ్బీర్ అలీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నా రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వెంకట రమణారెడ్డి కీలక ప్రకటన చేశారు. షబ్బీర్ అలీ వల్లే తాను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని అన్నారు. షబ్బీర్ అలీ(Shabbir Ali) అవినీతి బాగోతం మాచారెడ్డి ప్రజలకు తెలుసని చెప్పారు. ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు.
ఇది కేవలం ట్రైలర్ మాత్రమే
మహేందర్ రెడ్డిపై దాడి కేవలం ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా వేరే ఉంది. నేను పిలిస్తే వేలాది మంది వచ్చేవారు. నేను చర్చకు పిలిస్తే.. మీరే దాడులకు తెగబడ్డారు. అరోరా కాలేజీ భూముల్లో ఎవరు అవినీతి చేశారో కామారెడ్డి ప్రజలకు తెలుసు. నాపై ఇకనుంచి గీత పడినా ప్రభుత్వానిదే బాధ్యత అని కాటిపల్లి వెంకట రమణారెడ్డి కీలక ప్రకటన చేశారు.






