జీతాలు ఇచ్చే దిక్కులేదు బీసీ బంధా?: వీహెచ్

by Disha Web Desk 2 |
జీతాలు ఇచ్చే దిక్కులేదు బీసీ బంధా?: వీహెచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు బీసీలను మభ్యపెడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కుల గణన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో జీతాలకు డబ్బులు లేవు కానీ ఆ పార్టీ నేతలు బీసీ బంధు అంటున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ తాను బీసీ అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప ఈ తొమ్మిదేళ్ల పాలనలో బీసీ శాఖ ఏర్పాటు చేయలేదన్నారు. ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న అవినీతిపై రాహుల్ గొంతెత్తి ప్రశ్నిస్తున్నారని బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.



Next Story