ఢిల్లీకి చేరిన అభ్యర్థుల ఎంపిక కసరత్తు.. బీజేపీలో హై టెన్షన్!

by Disha Web Desk 4 |
ఢిల్లీకి చేరిన అభ్యర్థుల ఎంపిక కసరత్తు.. బీజేపీలో హై టెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల కౌంట్‌డౌన్ వేళ బీజేపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఢిల్లీకి చేరింది. జేపీ నడ్డాతో నేడు తెలంగాణ బీజేపీ నేతలు భేటీ కానున్నారు. అంబర్ పేట అసెంబ్లీ నుంచే కిషన్ రెడ్డి బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే కిషన్ రెడ్డి కార్యకర్తలకు స్పష్టత ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో కే. లక్ష్మణ్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముషీరాబాద్ నుంచి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నగర శివారు ప్రాంతాలపై కాషాయ నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎల్బీనగర్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంపై బూర నర్సయ్యగౌడ్ ఆసక్తి చూపుతున్నారు. రెండు స్థానాల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ఈటల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక కామారెడ్డి నుంచి అర్వింద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్, సిరిసిల్లలో బండి సంజయ్‌ పోటీ అంశంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ నేడు ఉన్నందున ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.



Next Story

Most Viewed