- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మరో షాక్.. సీబీఐకి ఫిర్యాదు చేసిన శేజల్!
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మరో షాక్ తగిలింది. తనను లైంగికంగా వేధించాడంటూ గత కొద్ది రోజులుగా దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తోన్న ఆరిజిన్ డైరీ సీఈవో శేజల్.. ఇవాళ ఎమ్మెల్యేపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దుర్గం చిన్నయ్య వ్యవహారంపై దర్యాప్తు చేసి, తనకు న్యాయం చేయాలని సీబీఐకి శేజల్ విజ్ఞప్తి చేసింది. కాగా, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మహిళ కమిషన్కు సైతం శేజల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఇక, గత కొంత కాలంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆరిజిన్ డైరీ సీఈవో శేజల్కు వివాదం జరుగుతోంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని.. అతడి దగ్గరికి అమ్మాయిలను పంపాలని బెదిరించాడని శేజల్ ఆరోపణలు చేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని శేజల్ ఢిల్లీలో న్యాయ పోరాటానికి దిగింది.
ఇప్పటికే ఎమ్మెల్యే చిన్నయ్యపై జాతీయ మహిళ కమిషన్లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శేజల్ రెండు సార్లు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇటీలవ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద పాయిజన్ తాగి శేజల్ సూసైడ్ అటెంప్ట్ చేసింది. గమనించిన తెలంగాణ భవన్ సిబ్బంది ఆమె ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకుంది.