CPM నేత తమ్మినేని వీరభద్రంకు భద్రత పెంపు

by Disha Web Desk 2 |
CPM నేత తమ్మినేని వీరభద్రంకు భద్రత పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి పోలీసులు భద్రత పెంచారు. 1+1 సెక్యూరిటీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిది. కాగా, ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో తమ్మినేని వీరభద్రం హస్తం ఉందని మృతుడి భార్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక, ఆ హత్య కేసులో స్వయంగా తమ్మినేని వీరభద్రం సోదరుడు తమ్మినేని కోటేశ్వరావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కారణంగానే తమ్మినేని వీరభద్రానికి భద్రత పెంచినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed