Election Code: ఎన్నికల కోడ్‍పై ఎస్ఈసీ కీలక ప్రకటన

by Prasad Jukanti |

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.

Election Code: ఎన్నికల కోడ్‍పై ఎస్ఈసీ కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల (Telangana Panchayat Elections) ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ (Election Code) ముగియనుందని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యావాదాలు తెలిపారు. ఎన్నికల కోడ్ సమర్థంగా అమలు చేసిన అధికారులకు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణికుముదిని (Rani Kumudini) అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఇద్దరు అధికారుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. ఎక్స్ గ్రేషియా కోసం కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

Next Story