మైనర్ బాలికపై అధికార పార్టీ సర్పంచ్ భర్త అత్యాచారం

by Disha Web Desk 4 |
మైనర్ బాలికపై అధికార పార్టీ సర్పంచ్ భర్త అత్యాచారం
X

దిశ, ఆమనగల్లు : మైనర్ బాలికపై అధికార పాార్టీ భర్త అత్యాచారం చేయడం కలకలం రేపింది. ఈ ఘటన కడ్తాల మండలంలోని గానుగు మర్ల తండా లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండల పరిధిలోని తండాకు చెందిన ఓ గిరిజన నిరుపేద కుటుంబం పొట్టకూటి కోసం కడ్తాల్ మండల సమీపంలోని ఓ తండాకు వచ్చి ఉంటోంది. తోటలో పని చేసుకుంటూ కుటుంబం జీవనం సాగిస్తున్నారు. భార్య, భర్త, 12 ఏళ్ల బాలిక స్థానికంగా నివాసం ఉంటున్నారు.

మంగళవారం తల్లితండ్రులు ఓ కార్యక్రమానికి వేరే ఊరికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన సర్పంచ్ భర్త తోటలో ఒంటరిగా ఉన్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి తోటకు చేరుకున్న తల్లితండ్రులకు సర్పంచ్ భర్త మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ విషయం బయటకు పొక్కడంతో బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Next Story

Most Viewed