- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల కోసం దేశంలోనే తొలిసారిగా ఓ కొత్త ఏర్పాటు
మహిళా ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్ లు, డిపోల్లో వెండింగ్ మిషన్ల ద్వారా సానిటరీ నాప్కిన్లను అందుబాటులో ఉంచనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్ లు, డిపోల్లో వెండింగ్ మిషన్ల ద్వారా సానిటరీ నాప్కిన్లను అందుబాటులో ఉంచనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. బస్సు ప్రయాణం చేస్తున్న సమయంలో మహిళలకు అత్యవసరంగా సానిటరీ నాప్కిన్ల అవసరం ఏర్పడే అవకాశం వస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారం తీసుకుని సహేలీ అనే సంస్థ ద్వారా బస్టాండ్లలో ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ , రవాణా శాఖల సహకారంతో పైలెట్ ప్రాజెక్టుగా ములుగు, హనుమకొండ బస్టాండ్ లలో మరో పది రోజుల్లో ఏర్పాటు చేయించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ తర్వాత దశల వారీగా హుస్నాబాద్, హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలకు విస్తరింపజేయిస్తామన్నారు.
శుక్రవారం హైదరాబాద్ప్రజా భవన్లో ఈ మేరకు సహేలి సంస్థ తెలంగాణ ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకోగా, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ల సమక్షంలో మంత్రి సీతక్క సహేలీ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ సహేలీ అనే సంస్థ మహిళల ఆరోగ్య విషయంలో పనిచేయడానికి ముందుకు వచ్చిందన్నారు. నెలసరితో మహిళ ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ములుగు , హనుమకొండలో బస్టాండ్లలో ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ముందుకొచ్చిన సహేలి సంస్థ వ్యవస్థాపకురాలు కొమ్ము అనుపమను మంత్రి సీతక్క అభినందించారు.






