- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sandhya Theatre Stampede : సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మరోసారి పోలీసులకు NHRC నోటీసులు
హైదరాబాద్(Hyderabad)లోని సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట(Sandhya Theatre Stampede) ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) కు మరోసారి నోటీసులు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట(Sandhya Theatre Stampede) ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై 6 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. తెలంగాణ పోలీసులు గతంలో ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్A(llu Arjun) నటించిన "పుష్ప 2: ది రూల్"(Pushpa 2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగి, రేవతి అనే 39 ఏళ్ల మహిళ మరణించగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ ఘటనపై అడ్వకేట్ రామారావు ఇమ్మనేని ఫిర్యాదు చేయడంతో NHRC చర్యలు తీసుకుంది. చిక్కడపల్లి పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని, దీనివల్ల రేవతి మరణించి, ఆమె కుమారుడు గాయపడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.






