Sandhya Theatre Incident: తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు.. పోలీస్ శాఖ హెచ్చరికలు

by Ramesh Goud |   (  Updated:2024-12-25 14:20:24  IST  )

సంధ్య థియేటర్ ఘటన(Sandhya Theatre Incident)పై తప్పుడు ప్రచారాలు(Face Propaganda) చేస్తే కఠిన చర్యలు(Strict Actions) తీసుకుంటామని పోలీస్ శాఖ(Police Department) హెచ్చరించింది.

Sandhya Theatre Incident: తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు.. పోలీస్ శాఖ హెచ్చరికలు
X

దిశ, వెబ్ డెస్క్: సంధ్య థియేటర్ ఘటన(Sandhya Theatre Incident)పై తప్పుడు ప్రచారాలు(Face Propaganda) చేస్తే కఠిన చర్యలు(Strict Actions) తీసుకుంటామని పోలీస్ శాఖ(Police Department) హెచ్చరించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ పెట్టింది. ఇందులో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అల్లు అర్జున్(Allu Arjun) రాకముందే తొక్కిసలాట జరిగినట్టు.. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని వివరించింది.

ఈ ఘటన పై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందని, ఐనా.. కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చిందని వెల్లడించింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. అంతేగాక ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తామని, ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోందని, దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ, సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ సూచించింది. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Next Story