- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సలేశ్వరం జాతరకు సాయంత్రం 5 గంటల వరకే అనుమతి
by Sathputhe Rajesh |
సలేశ్వరం జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు అటవీ శాఖ అధికారులు కీలక సూచన చేశారు.

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతర ఉత్సవాలకు వచ్చే భక్తులకు అటవీ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. ముందు ప్రకటించిన మాదిరిగానే శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపు వరకే సలేశ్వరం జాతరకు వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయని జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్ గోపిడి దిశకు ఫోన్ ద్వారా తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు కూడా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు అనుమతులు ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆలస్యంగా భక్తులు వస్తే అటవీశాఖ చర్యలకు బాధ్యత వహించాలని సూచించారు. కావున అధికారులకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






