కరీంనగర్‌లో సచిన్ టెండూల్కర్ అభిమాని అద్భుతం

by Disha Web Desk 4 |
కరీంనగర్‌లో సచిన్ టెండూల్కర్ అభిమాని అద్భుతం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని సిరిసిల్ల పట్టణంలో చేనేత కళకారుడు మరోసారి అద్భుతాన్ని సృష్టించాడు. ఎల్ది హరిప్రసాద్ తన కళా నైపుణ్యంతో మరో సారీ వార్తల్లోకి నిలిచాడు. భారత మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ జన్మదినం సందర్భంగా సచిన్ దంపతుల ఫోటోను మగ్గంపై నేసాడు. మగ్గంపై నేసి సచిన్ మిత్రుడు చాముండేశ్వరి నాథ్‌కి బహుకరించాడు. స్పందించిన చాముండేశ్వరి నాథ్ ఇలాంటి కళాకారులను ప్రోత్సహిస్తే ఇంకెన్నో విజయాలు సాధిస్తారన్నారు. సోమవారం గోవాలో జరిగే సచిన్ జన్మదిన వేడుకల్లో పాల్గొని సచిన్‌కు అందజేస్తాననని తెలిపారు. జన్మదిన వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.



Next Story

Most Viewed