విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఫెయిల్: బల్మూరి వెంకట్

by Disha Web Desk 19 |
విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఫెయిల్: బల్మూరి వెంకట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యారని ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్​ బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. అక్రమంగా గురునానక్, శ్రీ నిధి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరిగాయన్నారు. దీంతో సుమారు 5 వేల మంది విద్యార్ధులను నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అండదండలతోనే యాజమాన్యాలు గేమ్​ ఆడుతున్నాయని స్పష్టం చేశారు. ఈ రెండు విద్యాసంస్థల అవినీతిపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వెంకట్ ​మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి వెంకట్‌ను గోషా మహల్ ​పోలీస్​ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులు పెండింగ్‌లో ఉన్నా.. గురునానక్, శ్రీ నిధి కళాశాలల యాజమాన్యాలు అక్రమంగా అడ్మిషన్లు, ఫీజులు ఎలా వసూల్ చేస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వ అండదండలతోనే ప్రైవేట్ యాజమాన్యాల దౌర్జన్యం ఎక్కువైనట్లు మండిపడ్డారు.



Next Story

Most Viewed