Rythu Bandhu scheme : తొలి రోజు రైతుబంధు రూ.642.52 కోట్లు

by Dishafeatures2 |
Rythu Bandhu scheme : తొలి రోజు రైతుబంధు రూ.642.52 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వానాకాలం రైతు బంధు జమ అవుతోంది. తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లు 22 లక్షల 55,081 మంది రైతుల ఖాతాలలో జమ అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ప్రకారం రైతుబంధు నిధుల జమ ప్రారంభమయింది. ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాలలో నిధులు జమచేయడం జరుగుతుంది.

రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనల పాటించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఆర్థిక శాఖా మంత్రికి రైతుబంధు నిధుల విడుదల సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రెండు వారాల్లో రైతు బంధు ను 70లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.


Next Story

Most Viewed