ప్రయాణికులకు ఆర్టీసీ మరో గుడ్ న్యూస్

by Disha Web Desk 2 |
ప్రయాణికులకు ఆర్టీసీ మరో గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు మరింత చేరువ అయ్యేందుకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు వినూత్న ఆఫర్లు తీసుకు వస్తోంది. ఈ క్రమంలో తొలిసారిగా జనరల్ రూట్ బస్ పాస్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే టీ-24, టీ-6, ఎఫ్-24 టికెట్లతో ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తున్న ఆర్టీసీ.. సిటీలో తక్కువ దూరంతో ప్రయాణించే వారి కోసం తొలిసారిగా రూట్ పాస్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. సిటీలో 8 కిలోమీటర్ల పరిధిలో తిరిగే ప్రయాణికుల ఈ రూట్ పాస్ ను మే 27 నుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఈ రూట్ పాస్ ధరలను సంస్థ ప్రకటించింది. నెల రోజులకు గాను సిటి ఆర్డినరీ బస్ పాస్ లకు రూ.600, మెట్రో ఎక్స్ ప్రెస్ రూట్ పాస్ కు రూ.1000 నిర్ణయించింది. ఐటీ కార్డు కోసం రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.



Next Story

Most Viewed