మిషన్ భగీరథ పేరుతో రూ.47 వేల కోట్లు కాజేశారు: కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే వివేక్ సంచలన ఆరోపణలు

by Disha Web Desk 1 |
మిషన్ భగీరథ పేరుతో రూ.47 వేల కోట్లు కాజేశారు: కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే వివేక్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో బాగుపడింది కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమేనని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆరోపించారు.ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని తెలిపారు. కేవలం ఒక్క మిషన్ భగీరథల పథకంలోనే కేసీఆర్ కుటుంబం రూ.47 వేల కోట్లు కాజేసిందని ఆరోపించారు. పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టును రూ. వేల కోట్లను అప్పనంగా నొక్కేశారని ధ్వజమెత్తారు. సింగరేణి సంస్థలో 5 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. అదేవిధంగా 100 రోజుల్లో సిల్క్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని, కేవలం 3 నెలల్లోనే కాంగ్రెస్ అద్భుతమైన ఫథకాలు ప్రవేశ పెట్టిందని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు.



Next Story

Most Viewed