ఎన్నికల వేళ ఖమ్మంపై స్పెషల్ ఫోకస్.. రూ.100 కోట్ల నిధులు మంజూరు

by Disha Web Desk 4 |
ఎన్నికల వేళ ఖమ్మంపై స్పెషల్ ఫోకస్.. రూ.100 కోట్ల నిధులు మంజూరు
X

దిశ, ఖమ్మం బ్యూరో: ఎన్నికల వేళ ఖమ్మం ప్రజలకు కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మంత్రి పువ్వాడ విజ్ఞప్తి మేరకు ఖమ్మం కార్పొరేషన్‌కు మంత్రి కేటీఆర్ రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశారు. మంత్రిగా నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మంత్రి అజయ్ కుమార్‌కు ఈ మేరకు జీవో కాపీని మంత్రి కేటీఆర్ అందజేశారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ గారు నాలుగేళ్ళ పదవీకాలం పూర్తిచేసుకుంటున్న శుభ సందర్భంగా ఖమ్మంకు మరోసారి నిధుల వరద పారించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కేటీఆర్‌కు చేసిన విజ్ఞప్తి మేరకు TUFIDC(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా ఖమ్మంకు రూ.100 కోట్ల నిధులను విడుదల చేశారు. నేడు ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదగా జీవో కాపీని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకున్నారు. ఖమ్మం అభివృద్ధికి మరో రూ.100 కోట్ల నిధులు ఇచ్చిన సందర్భంగా పువ్వాడ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నాలుగేళ్ళ సుపరిపాలన పూర్తి చేసుకున్న పువ్వాడకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Read Disha E paper
👉 Follow us on Google News
👉 Follow us on whatsapp channel



Next Story

Most Viewed