- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిందితుడు మంత్రి జూపల్లి ఇంట్లోనే ఉండు.. డీజీపీని కలిసిన RS ప్రవీణ్ కుమార్
తెలంగాణ డీజీపీ రవి గుప్తాను బీజేపీ నాయకులు, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కలిశారు. ఇటీవల దారుణ హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి న్యాయం చేయాలని డీజీపీని రిక్వెస్ట్ చేశారు.

దిశ, వెబ్డెస్క్: తెలంగాణ డీజీపీ రవి గుప్తాను బీజేపీ నాయకులు, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కలిశారు. ఇటీవల దారుణ హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి న్యాయం చేయాలని డీజీపీని రిక్వెస్ట్ చేశారు. అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగి నాలుగు రోజులైనా ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీద ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉందని గుర్తుచేశారు. వారంరోజుల్లో న్యాయం జరుగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ప్రధాన నిందితుడు మంత్రి జూపల్లి ఇంట్లోనే ఉన్నాడు. శ్రీధర్ రెడ్డి హత్యను ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. కాగా, బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.






