‘గ్రూపు-1 పరీక్ష రద్దు చేయాల్సిందే.. లేదంటే తెలంగాణ అగ్గి గుండమే’

by Disha Web Desk 2 |
‘గ్రూపు-1 పరీక్ష రద్దు చేయాల్సిందే.. లేదంటే తెలంగాణ అగ్గి గుండమే’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొట్లాడి సాధించున్న రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అందరి తెలంగాణ కాదని కొందరి తెలంగాణ మాత్రమే అని అన్నారు. శుక్రవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత మాయావతి నాడు 36 మంది సభ్యులతో తెలంగాణ కు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అమరవీరుల కలల సాధ్యం అయ్యే వరకు పోరాడుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ లోని వంద ఏళ్ళ సంపదను కేసిఆర్ కుటుంబం పది ఏళ్లలో కైవసం చేసుకుందని ఆరోపించారు.

రాష్ట్రం అప్పులపాలు ఐనది అని అన్నారు. నిరుద్యోగ సమస్యల మీద ఒక్క మాట సీఎం మాట్లాడలేదన్నారు. టీఎస్పీఎస్సీ అసలు దొంగల్ని పట్టుకోకుండా ఇప్పుడు చిన్నచిన్న వాల్లని అరెస్ట్ చేస్తున్నారని విమర్శలు చేశారు. జూన్ 11 న జరిగే గ్రూప్ వన్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ అగ్గి గుండం అవుతుందని హెచ్చరిక చేశారు. తెలంగాణ లో వలసలు లేవు అని చెబుతున్నారు.. నాతో రాండి సీఎం వలసలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాం... అని మండి పడ్డారు. రైతు ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఇవ్వాళ ఒక రైతు తన భూమి కోసం తన దగ్గరకు వచ్చారని, ఆయనను ఒక కోటి రూపాయల లంచం అడిగారని తెలిపారు. తెలంగాణ ప్రజలరా ఇవి సంబరాలు కాదు.. దోపిడీని ప్రశ్నించాలని, కొందరి తెలంగాణను అందరి తెలంగాణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed