తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

by Disha Web Desk 2 |
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని.. దీనిని కళ్లారా చూసేందుకు పెద్ద ఎత్తున మైదానికి రావాలని పిలుపునిచ్చారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక రేపు నగరానికి రానున్నారు.




Next Story