Revanth Reddy : సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి రేవంత్ రెడ్డి

by Disha Web Desk 2 |
Revanth Reddy : సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రాష్ట్ర సచివాలయానికి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా సచివాలయానికి వెళ్లారు. ముందుగా సెక్రటేరియట్ ఎదుట పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సదర్భంగా అధికారులు కొత్త ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అటు నుంచి నేరుగా సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉన్న సీఎం చాంబర్‌కు వెళ్లారు. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి దేశ వ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలూ విషెస్ చెబుతున్నారు.

Next Story