మంచి మిత్రుడిని కోల్పోయా.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్

by Disha Web Desk 19 |
మంచి మిత్రుడిని కోల్పోయా.. రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగాడ సంతాపం వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి మృతితో మంచి మిత్రుడిని కోల్పోయానని ఆయన బాధపడ్డారు. దయాకర్ రెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు పరిష్కరించేవారని రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘మాజీ ఎమ్మెల్యే, నా ఆప్తుడు కొత్తకోట దయాకర్ రెడ్డి గారి అకాల మరణం బాధాకరం. పాలమూరు జిల్లా నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యం కారణంగా ఇవాళ మృతి చెందారు. టీడీపీ నుండి ఆయన మూడసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Also Read: బీజేపీలోకి మరో కాంగ్రెస్ కీలక నేత.. తెరవెనుక చక్రం తిప్పుతోన్న జేజమ్మ..?

Next Story

Most Viewed