ఆరుగురు ముఖ్యమంత్రులకు రేవంత్ ఆహ్వానం

by Disha Web Desk 2 |
ఆరుగురు ముఖ్యమంత్రులకు రేవంత్ ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరుగురు ముఖ్యమంత్రులకు రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపించారు. ఏపీ సీఎం జగన్‌కు, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బిహార్ సీఎం నితీశ్ కుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్‌కు ఇన్విటేషన్ పంపారు. అంతేకాదు.. వీరితో పాటు తెలంగాణ తాజా మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపారు. కాగా, రేపు మధ్యాహ్నం 1:04 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే అధికారులు స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.



Next Story

Most Viewed