- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘నేను భూమి కొనుగోలు చేసినప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే’
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తవ్వినా కొద్ది ఆయన అవినీతి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. 8 రోజుల కస్టడీలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇష్యూలో మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్పైనా ఆరోపణలు వచ్చాయి. తాజాగా.. తనపై వచ్చిన ఆరోపణలపై రజత్ కుమార్ స్పందించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
2013-2014 లో GAD పర్మిషన్తో భూమి కొనుగోలు చేశానని చెప్పారు. తాను భూమి కొనుగోలు చేసినప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉందని అన్నారు. అదే భూమిని 2021లో అమ్ముకున్నానని వెల్లడించారు. 2019లో కూడా తనపై ఇలాంటి తప్పుడు ప్రచారమే చేశారని గుర్తుచేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story