ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ట్వీట్

by Disha Web Desk |
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రూ.20 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆర్మూర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు వడ్డీతో కలిపి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆర్టీసీకి కూడా రూ. 7 కోట్లు బకాయి చెల్లించాలి. ఈ వ్యవహారంపై రిటైర్ట్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ప్రభుత్వ, కార్పొరేషన్స్ అధికారులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు ఇట్లా ఫేవర్ చెయ్యడం దురదృష్టకరం. రాజకీయ నాయకులు ఇట్లా అధికారం దుర్వినియోగం చేయడం సిగ్గు చేటు. రాజకీయాలను వ్యాపారం చెయ్యడం ఈ దేశానికి పట్టిన దరిద్రం. కొత్త ప్రభుత్వం ఇలాంటి విషయాల మీద సరైన విధానం తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed