కేటీఆర్ బాబు.. ఇంకా చాలు మీ పరిపాలన..! రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఫైర్

by Disha Web Desk 4 |
కేటీఆర్ బాబు.. ఇంకా చాలు మీ పరిపాలన..!  రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, తెల్ల రేషన్ కార్డు వారికి సన్న బియ్యం ఇస్తామని మంత్రి కేటీఆర్ తాజాగా చొప్పదండి రోడ్ షోలో పలు హామీలు ఇచ్చారు. ఈ హామీలపై రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్ కన్వీనర్ ఆకునూరి మురళి ఇవాళ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

‘కేటీఆర్ బాబు పేదలకు, రైతులకు నిరుద్యోగులకు సంబంధించిన రేషన్ కార్డులు, పంట బీమాలు, పంట నష్ట పరిహారం, ఇండ్లు, ఉద్యోగాలు మొదలైనవి ఒక విధానం (పాలసీ) ద్వారా నడవాలి. మీరేమో కొత్తగా మీ దయాదాక్షిణ్యాల మీదనే నడిచేటట్లు ఒక చెత్త పరిపాలన మొదలు పెట్టిండ్రు. దీన్నే దొరల పాలన అంటారు. తెలంగాణను చాలా మోసం చేసిండ్రు అయ్యా. కేసీఆర్ గజ్వెల్ ప్రజలకు నేనేం చెయ్యలేకపోయిన అని క్షమాపణలు అడిగినట్లు తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలి, ఇంకా చాలు మీ పరిపాలన’ అంటూ ట్వీట్ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed