- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్త్ పేపర్ లీక్ కేసులో విద్యార్థి హరీశ్కు ఊరట
టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో హరీశ్ అనే విద్యార్థిని ఐదేళ్లు డిబార్ చేశారు. దీనిపై స్పందించిన హరీశ్ తల్లిదండ్రులు కూడా తన కొడుకు జీవితాన్ని నాశనం చేయొద్దంటూ డిబార్ ఎత్తివేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కన్నీటి పర్యంతమయ్యారు.

దిశ, వెబ్డెస్క్: టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో హరీశ్ అనే విద్యార్థిని ఐదేళ్లు డిబార్ చేశారు. దీనిపై స్పందించిన హరీశ్ తల్లిదండ్రులు కూడా తన కొడుకు జీవితాన్ని నాశనం చేయొద్దంటూ డిబార్ ఎత్తివేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కన్నీటి పర్యంతమయ్యారు. అయినా.. దీనిపై అధికారుల నుంచి స్పందన రాకవడంతో విద్యార్థి తండ్రి హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా.. దీనిపై శనివారం విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
హరీష్కు ఊరటినచ్చేలా తీర్పునిచ్చింది. హరీష్కు మిగతా పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టు తెలిపింది. హరీష్ సోమవారం నుంచి పరీక్షలకు హాజరుకావొచ్చని హైకోర్టు తెలిపింది. హరీష్కు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టు అధికారులకు తెలిపింది. హరీశ్ తండ్రి చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో హరీష్ సోమవారం నుంచి పరీక్షలు రాసే అవకాశం లభించనుంది. కాగా, పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.






