ధర్మం కోసం చావడానికైనా సిద్ధం : రాజాసింగ్

by Disha Web Desk 4 |
ధర్మం కోసం చావడానికైనా సిద్ధం : రాజాసింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రతి హిందువులో రామభక్తి భావన తీసుకొస్తానన్నారు. ఎన్ని సార్లు జైలుకి పంపినా ధర్మంపై పోరాటం ఆపనన్నారు. రామనవమి శోభాయాత్రనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. భారత దేశం హిందూ రాష్ట్రం కావలన్నదే తన సంకల్పమన్నారు. శోభాయాత్రకు భారీగా రామ భక్తులు రావడం హిందూ రాష్ట్ర ఏర్పాటుకు సంకేతం అన్నారు. పోలీసులు, అధికారులు, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధర్మంపై పోరాటం చేసేందుకు వెనకాడేది లేదన్నారు. రాజకీయం వేరు ధర్మం వేరు అని రాజాసింగ్ అన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ వైపు నిలిచినా పర్వాలేదని కానీ ధర్మం వైపు మాత్రం నిలవాలని కోరారు.

Next Story