అమ్మకు గుండెపోటు అనాథలైన ముగ్గురు పిల్లలు

by Dishanational2 |
అమ్మకు గుండెపోటు అనాథలైన ముగ్గురు పిల్లలు
X

దిశ, చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంతారం గ్రామంలో ముక్కు పచ్చలారని పసి పిల్లలు అనాథలైనారు. అంతారం గ్రామంలో సిరిగిరి జంగమ్మ 38 గుండెపోటుతో మరణించింది. మృతురాలు భర్త గత ఐదు సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. అప్పటి నుండి జంగమ్మ కూలినాలి చేసి ముగ్గురు పిల్లలను పోషించుకుంటుంది. మంగళవారం ఉదయం జంగమ్మ హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. తల్లి అకాల మరణంతో ముక్కుపంచ్చలారని ముగ్గురు పిల్లలు ప్రశాంత్ (13), లక్మి (8), శివ (7) లు అనాథలుగా మిగిలిపోయారు. ఈ సంఘటన గ్రామ ప్రజలను కలసివేసింది. అనాథలైన పిల్లలను చూసి గ్రామస్తులు కన్నీరు మున్నూరుగా విలపించారు.



Next Story

Most Viewed