గిరిజన తండాల అభివృద్ధికి ఉప్పల ట్రస్ట్ భరోసా.. ఉప్పల వెంకటేశ్

by Dishafeatures2 |
గిరిజన తండాల అభివృద్ధికి ఉప్పల ట్రస్ట్ భరోసా.. ఉప్పల వెంకటేశ్
X

దిశ, ఆమనగల్లు: నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పేర్కొన్నారు. బుధవారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి పెంటతండ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తుల్జా భవాని దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మిఠాయిపల్లి పెంటతండలో నలుగురు నిరుపేదలకు ట్రస్టు ద్వారా స్వంత ఇంటి నిర్మాణం చేస్తామని శ్రీకారం చుట్టారు. గ్రామంలో 20 వీధిలైట్లు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, నాయకులు శంకర్, పర్వతాలు, వెంకట్, కృష్ణ, శివలింగం, రాజు, బాలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed