అకాల వర్షం.. రైతులకు అపార నష్టం..

by Disha Web Desk 11 |
అకాల వర్షం.. రైతులకు అపార నష్టం..
X

దిశ, పరిగి: పరిగిలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులు, ఓ మోస్తారు వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. పరిగి మండల పరిధిలోని మాదారం, పొల్కంపల్లి, ఖుదావంద్​ పూర్​, నర్సయ్యగూడతో పాటు వివిధ గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నర్సయ్యగూడ లో జొన్న పంట నేలకొరిగింది. మాదారం పొల్కంపల్లి గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఖుదావంద్​ పూర్​ గ్రామంలో సుబ్బారెడ్డి మామిడి తోటలో కాయలు నేలరాలాయి. చిగురాల్​ పల్లి గ్రామంలో కోత కొచ్చిన వరి పొలం నేలకొరిగింది.

ఈ పంటలను సోమవారం వ్యవసాయాధికారులు పరిశీలించారు. నేల కొరిగిన మొక్కజొన్న, జొన్న పంటలను నాలుగైదు మొక్కలను కలిపి కట్టేసీ కాపాడుకునే ప్రయత్నం చేయాలని రైతులకు సూచించామని ఏఓ ప్రభాకర్​ రెడ్డి తెలిపారు. నేలకొరిగిన పంటలను బీజేపీ నాయకులు పరిశీలించారు. నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్, జిల్లా కార్యదర్శులు పెంటయ్య, హరికృష్ణ, సీనియర్ నాయకులు రాము యాదవ్, పట్టణ అధ్యక్షుడు శ్రీశైలం, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహా, నాయకులు రమేష్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story