శంషాబాద్‌లో బెంజ్ కారు బీభత్సం.. ఉలిక్కిపడ్డ ప్రజలు

by Web Desk |
శంషాబాద్‌లో బెంజ్ కారు బీభత్సం.. ఉలిక్కిపడ్డ ప్రజలు
X

దిశ, శంషాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి కారుతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ వివరాల ప్రకారం.. మెహిదీపట్నంకు చెందిన అమీర్ సోయల్, రోహిణి అనే ఇద్దరు మద్యం మత్తులో(TS15EL5058) బెంజ్ కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ బస్టాండ్ వద్దకు రాగానే కారు అతి వేగంగా నడిపారు. దీంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న భారీ గేట్లను బలంగా ఢీకొట్టింది. దీంతో స్థానికులంతా భయబ్రాంతులకు గురయ్యారు. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. భారీ గేట్ వైపు కాకుండా కారు పక్కనున్న హోటల్ వైపు దూసుకొస్తే పెను ప్రమాదం జరిగేదన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కారును పరిశీలించగా, అందులో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మద్యం సేవించి అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.



Next Story

Most Viewed