ఢీకొన్న రెండు కార్లు.. ఐదుగురికి గాయాలు

by Taduka Kalyani |

రెండు కార్లు ఢీకొని ఐదుగురు గాయపడిన ఘటన మంగళవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఢీకొన్న రెండు కార్లు..  ఐదుగురికి గాయాలు
X

దిశ, యాచారం : రెండు కార్లు ఢీకొని ఐదుగురు గాయపడిన ఘటన మంగళవారం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తమ్మలోని గూడ, గేటు వద్ద వేగంగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు, సువర్ణ, భాగ్యలక్ష్మి, అరుణ జ్యోతి, లక్ష్మీకుమారి, గాయపడ్డారు. చికిత్స కోసం స్థానికులు మాల్, లోని పీపుల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story