ప్రజల సంక్షేమం కోసం తపించే నాయకుడు టీఆర్​ఆర్​ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్​ రెడ్డి

by Disha Web Desk 20 |
ప్రజల సంక్షేమం కోసం తపించే నాయకుడు టీఆర్​ఆర్​ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్​ రెడ్డి
X

దిశ, పరిగి : ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నాయకుడు మీ రామ్మోహన్​ రెడ్డి అని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవెంత్​ రెడ్డి అన్నారు. పరిగిలోని టి.రామ్మోహన్​ రెడ్డి నివాసంలో శుక్రవారం టీఆర్​ఆర్​ కొడుకు డాక్టర్​ తమ్మన్న రితిక్​ రెడ్డి జన్మదిన వేడుకలకు రేవెంత్​ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రితిక్​ రెడ్డి జన్మదిన వేడుకల సందర్బంగా వేలాదిగా కార్యకర్తల మద్య కేక్​ కట్​ చేశారు.

ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవెంత్​ రెడ్డి మాట్లాడుతూ తన కొడుకు జన్మదిన వేడుకలను కూడా సేవా మార్గంలోనే నిర్వహించడం అభినందనీయమన్నారు. కొన్నేళ్లుగా టీఆర్​ఆర్​ మెడికల్​ కళాశాల ఆధ్వర్యంలో ఉచితంగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. సేవే పరమావధిగా పనిచేస్తున్న టీఆర్​ఆర్​ ప్రజలు ఎమ్మెల్యేగా ఆశీర్వదించకపోవడం దురదృష్టకరమన్నారు. గుడులు, గుడి మాన్యాలు మింగేస్తున్న నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అభివృద్దిని కాలదన్నినట్లే అయ్యిందన్నారు.

రైతుబంధు, రైతుబీమా, దళితబంధు అన్ని బంధుల్లో ఈ రాబంధులుగా వీళ్ల జేబులు నింపుకుంటున్నారన్నారు. ఆనాడు పరిగి ఎమ్మెల్యేగా లేకుండానే ఆనాటి ముఖ్య మంత్రికిరణ్​ కుమార్​ రెడ్డిన పరిగి తీసుకువచ్చి హాస్టల్​ లో బస చేయించి పరిగి అభివృద్దికి 5 కోట్లు తీసుకువచ్చి అభివృద్ది చేసిన గొప్ప నాయకత్వం టీఆర్​ఆర్​ అని పొగిడారు. తెలంగాణలో జిల్లా నుంచి రాష్ర్ట రాజకీయాలను శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

వికారాబాద్​ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ జెండా ఎగుర వేయడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్​ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్​ పార్టీ అండగా ఉంటుందని, పార్టీ పటిష్టతకు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. దేశ రాజకీయాలను శాశిస్తూ, బీ ఫాంలపై సంతకం పెట్టే అధికారం ఈ గడ్డకే వచ్చిందని మన గడ్డ పరువు, ప్రతిష్టతను నిలుపుకోవాల్సిన బాధ్యత అందరికిపై ఉందన్నారు.

అనంతరం డీసీసీ అధ్యక్షులు టి.రామ్మోహన్​ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ పటిష్టతకు తనకు సహకరిస్తున్న ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానన్నారు. మన పార్టీ అధికారంలోకి మరింత అభివృద్ది చేసుకుందామని అభివృద్ది, సేవా ధ్యేయంగా పనిచేస్తున్న తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్​ఆర్​ సతీమని ఉమా టీఆర్​ఆర్​, కాంగ్రెస్​ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.హన్మంతు ముదిరాజ్​, భీంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బి.పరశురాంరెడ్డి, బీఎస్​ ఆంజనేయులు, అల్పటి అశోక్​, సురేందర్​, లాల్​ కృష్ణ ప్రసాద్​, ఎజాజ్​, రియాజ్​, అక్బర్​ పాల్గొన్నారు.



Next Story

Most Viewed