- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు.. పనిముట్లు స్వాధీనం చేసుకున్న పంచాయతీ అధికారులు
అనుమతులు లేని అక్రమ నిర్మాణాలు.. పనిముట్లు స్వాధీనం చేసుకున్న పంచాయతీ అధికారులు
by Disha Web Desk 20 |
X
దిశ, శంషాబాద్ : అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని పెద్ద షాపూర్ తాండ పంచాయతీ కార్యదర్శి యాదయ్య హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ తాండలోని సర్వేనెంబర్ 220లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నారని వచ్చిన సమాచారంతో గ్రామపంచాయతీ కార్యదర్శి యాదయ్య సిబ్బందితో కలిసి గ్రామపంచాయతీ తరలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శంషాబాద్ మండలం పూర్తిగా 111 జీవో పరిధిలో ఉండడంతో నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వడం కుదరదని 111 జీవోను ఉల్లంఘించి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణదారులకు నోటీస్ కూడా ఇచ్చారని తెలిపారు. మరోసారి అక్రమ నిర్మాణాలు చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
Next Story