అన్ని వర్గాల అభ్యున్నతికి సర్కార్ కృషి : హోంమంత్రి

by Disha Web Desk 23 |
అన్ని వర్గాల అభ్యున్నతికి సర్కార్ కృషి : హోంమంత్రి
X

దిశ, రాజేంద్రనగర్ : కేసీఆర్ సర్కారు రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ఆరంగర్ చౌరస్తాలోని మెట్రో క్లాసిక్ గార్డెన్ లో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో డ్రైవర్ కమ్ ఓనర్ పథకం లో భాగంగా మంజూరైన కార్లను మంత్రి మహమూద్ అలీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చైర్మన్ ఇంతియాజ్, ఎమ్మెల్సీ రెహ్మాత్ బేగ్, స్థానిక ఎమ్మెల్యే తదితరులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు వస్తుందని తెలియజేశారు. మరో మారు రాష్ట్రంలో తమ సర్కారు రానుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పోరేటర్ అర్చన జయప్రకాష్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి , మైనార్టీ వెల్ఫేర్ అధికారులు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed