జూలై 5లోపు రైతు భరోసా దరఖాస్తులు చేసుకోవాలి

by Taduka Kalyani |

కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని శనివారం మండల వ్యవసాయ అధికారి పి.కవిత ప్రకటనలో తెలిపారు.

జూలై 5లోపు రైతు భరోసా దరఖాస్తులు చేసుకోవాలి
X

దిశ,కడ్తాల్: కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని శనివారం మండల వ్యవసాయ అధికారి పి.కవిత ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, బ్యాంకు ఖాతా పాస్‌బుక్/అకౌంట్ జిరాక్స్ కాపులతో పాటు సరైన మొబైల్ నంబర్ వివరాలను సమర్పించాలని సూచించారు. అర్హులైన రైతులు జూలై 5వ తేదీ లోపు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారులను లేదా మండల వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని అర్హులైన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Next Story