- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేసీఆర్ తాత మా అమ్మ, నాన్నలను రెగ్యులరైజ్ చేయండి..
by Disha Web Desk 11 |
X
దిశ, ఊట్కూర్: కేసీఆర్ తాత మా అమ్మ, నాన్నలను రెగ్యులరైజ్ చేయండి అని పంచాయతీ కార్యదర్శుల పిల్లలు వేడుకున్నారు. మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శుల శాంతియుత సమ్మె రెండవ రోజుకు చేరుకుంది. శనివారం పంచాయతీ కార్యదర్శులు వాళ్ల పిల్లలతో సమ్మెలో పాల్గొన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ సమయం పూర్తి అయినా రాష్ట్ర సర్కార్ రెగ్యులర్ చేయడంలో కాలయాపన చేస్తోందన్నారు.
వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవోను విడుదల చేయాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉద్యోగులు మరణించిన పంచాయతీ కార్యదర్శిల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ఉద్యోగం కల్పించాలన్నారు. కాగా పంచాయతీ కార్యదర్శులకు తన సపోర్ట్ ఎల్లప్పుడు ఉంటుందని చిన్నపొర్ల సర్పంచ్ రవీందర్ రెడ్డి తెలిపారు.
Next Story