కేసీఆర్ పై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ నిరసన

by velandi.Saikiran |

కేసీఆర్ పై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ స్థానిక భూ లక్షమ్మ చౌరస్తాలో నిరసన చేపట్టారు మండల బీఆర్ఎస్ నాయకులు. ఈ

కేసీఆర్ పై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ నిరసన
X

దిశ, బొంరాస్ పేట్: కేసీఆర్ పై సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ స్థానిక భూ లక్షమ్మ చౌరస్తాలో నిరసన చేపట్టారు మండల బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి మాట్లాడుతూ... రైతులకు మేలు చేయాలని కేసీఆర్... కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ఒకేచోట కుంగిపోవడం తో మొత్తం ప్రాజెక్టు నే తప్పు పట్టడం సరైనది కాదన్నారు. కేసీఆర్ ను ఏమి చేయలేక సీబీఐకి అప్పగించారని రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి, మండల రైతుబంధు సమన్వయ కమిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కొత్తూరు బాల్ రెడ్డి, తుంకిమెట్ల ఎంపీటీసీ తిరుపతయ్య,ఎనికెపల్లి రవీంద్ర చారి,, శ్యామలయ్య గౌడ్ పాల్గొన్నారు.

Next Story