- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనక్కి తగ్గే ఆలోచన లేదు.. E-20 పెట్రోల్ పై పార్లమెంట్లో కేంద్రం క్లారిటీ
E-20 పెట్రోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెట్ కు ఇచ్చిన సమాధానంలో కీలక విషయం స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: E-20 పెట్రోల్ విషయంలో దేశవ్యాప్తంగా వాహనదారుల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న E-20 పెట్రోల్ పూర్తిగా సురక్షితమైనదని, పర్యావరణ హితమైనదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇథనాల్ లేని 'ప్యూర్ పెట్రోల్'కు తిరిగి వెళ్లే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. అలాగే ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం ఉన్న 20 శాతానికి మించి పెంచే నిర్ణయం కూడా తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ తాజాగా పార్లమెంట్లో వెల్లడించారు. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి.. తక్కువ ప్రమాణాలకు తిరిగి వెళ్లడం కాకుండా, ఉన్నతమైన, మెరుగైన సాంకేతికత వైపు పయనించడమే ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. పార్లమెంటులో సమర్పించిన గణాంకాల ప్రకారం, భారతదేశం 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే సాధించిందని పేర్కొన్నారు.






