'దిశ' నిర్దేశం చేస్తోంది.. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి

by Dishafeatures2 |
దిశ నిర్దేశం చేస్తోంది.. ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి
X

దిశ, పరిగి : 'దిశ' పత్రిక అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తోందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి అన్నారు. పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి తన నివాసంలో ఆదివారం 'దిశ' పత్రిక 2023 నూతన సంవత్సరం క్యాలెండర్​ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి మాట్లాడుతూ.. నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రిక 'దిశ' అని కొనియాడారు. 'దిశ' పత్రిక సమస్యలను ఎత్తి చూపుతూ అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలను చూపిస్తుందన్నారు. పోటీ పత్రికలకు ధీటుగా నిలుస్తూ డిజిటల్​ రంగంలో తక్కువ కాలంలో తనదైన ముద్ర సంపాదించుకోవడం అభినందనీయమన్నారు. ఈ 'దిశ'పత్రిక క్యాలండర్​ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవింద్​ రావ్​, ఏఎంసీ చైర్మన్​ అంతిగారి సురేందర్​ కుమార్​, బీఆర్ఎస్​ మండల పార్టీ అధ్యక్షులు రొయ్యల ఆంజనేయులు,'దిశ' పరిగి నియోజవకవర్గ ఇంచార్జి పొతెదార్​ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed