బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

by Kalyani |
బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
X

దిశ, తాండూరు రూరల్: ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. టౌన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని తాండూరు టౌన్ సాయిపూర్ తులసి గార్డెన్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళాకారుల ఆటపాటలు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి గజమాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును రెండు కళ్లుగా సీఎం కేసీఆర్‌ చేపడుతున్నారని వివరించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు, సంపదను కొల్లగొట్టేందుకు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వివిధ శక్తులు పొంచి ఉన్నాయని అన్నారు.

ఆ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో, తాండూరులో బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. గందరగోళం సృష్టించాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేని సిటీలో బీజేపీ ఇతర పార్టీలు ఉన్నాయన్నారు. ఆ శక్తులను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పు, మాజీ చైర్మన్ విట్టల్ నాయక్, రాజు పటేల్, విజయదేవి, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed