బీజేపీని దేశంలో గద్దె దింపుతాం : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి

by Disha Web Desk 20 |
బీజేపీని దేశంలో గద్దె దింపుతాం : ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి
X

దిశ, పరిగి : పెంచిన గ్యాస్​, పెట్రోల్​, డీజీల్​ ధరలను వెంటనే తగ్గించకకుంటే కేంద్రప్రభుత్వానికి బుద్ది చెబుతామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి అన్నారు. పరిగిలోని తన నివాసంలో బుధవారం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్​, డీజీల్​, గ్యాస్​ ధరలు పెంచడం వల్ల వాటి ప్రభావం నిత్యావసర సరుకుల పై పడుతుందన్నారు. దీంతో పేద, మద్య తరగతి వారు బతుకు భారంగా మారిందన్నారు. సబ్​ కా సాత్​ సబ్​ కా వికాస్​ అంటూ నినాదాలు చేయడమే తప్ప సామాన్యుడు కడుపు మీద కొట్టేలా ధరలు పెంచుతుందన్నారు.

తాగాజా గ్యాస్​ సిలిండర్​ పై 50, కమర్షల్​ సిలిండర్​ పై 350 రూపాయలు పెంచుతూపోతూ సగటు బతుకు జీవిపై మోయలేని భారం వేస్తుంన్నారు. ప్రైవేటు దోపిడీ దారులు, మోడీ స్నేహితులకు ఏకంగా 12 లక్షల కోట్లు మాఫీ చేసి ఈ ధరలన్నీ పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా కేంద్రం పెంచిన ధరలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్​ చైర్మన్​ కొప్పుల శ్యాంసుందర్​ రెడ్డి, ఏఎంసీ చైర్మన్​ అంతిగారి సురేందర్​ కుమార్​, బీఆర్​ఎస్​ మండల పార్టీ అధ్యక్షుడు రొయ్యల ఆంజనేయులు, పీఏసీఎస్​ వైస్​ చైర్మన్​ శివన్నోళ్ల భాస్కర్​, నాయకులు బేతు ప్రవీన్​ కుమార్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed