అభివృద్ధిని చూసే బీఆర్ఎస్లో చేరికలు.. MLA అంజయ్య యాదవ్

by Dishafeatures2 |
అభివృద్ధిని చూసే బీఆర్ఎస్లో చేరికలు.. MLA అంజయ్య యాదవ్
X

దిశ, నందిగామ: తమ అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని MLA అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆదివారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఆయన పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ గ్రామ సర్పంచ్ ఎనుగొండ రమేష్, నందిగామ పీఏసీఎస్ చైర్మన్ తోట రాజగోపాల్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed