ఉర్సు ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

by Disha Web Desk 20 |
ఉర్సు ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
X

దిశ, బడంగ్ పేట్​ : మహేశ్వరం నియోజకవర్గంలోని జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 375 సంవత్సరాల చరిత్ర గల పహాడీ షరీఫ్ బాబా షర్ఫద్దీన్ దర్గాలో మార్చి 9వ తేదీన 757వ ఉర్సు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర విద్యాశాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి గురువారం పరిశీలించారు. ముందుగా మంత్రి దర్గాను సందర్శించి చాదర్​, పూలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

మార్చి 9 నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి సబితా జల్​పల్లి మున్సిపల్ కమిషనర్ వసంతను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, కమిషనర్ వసంత, బీఆర్​ఎస్​ నాయకులు సయ్యద్ యూసుఫ్ పటేల్, ఖైసర్ బామ్, షేక్ అప్జల్, ఇక్బాల్ బిన్ ఖలీఫా తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed