మంచిరెడ్డి పద్మమ్మ అంతక్రియల్లో పాల్గొన్న మంత్రి సబితా..

by Disha Web Desk 20 |
మంచిరెడ్డి పద్మమ్మ అంతక్రియల్లో పాల్గొన్న మంత్రి సబితా..
X

దిశ, ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మంచి రెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి మంచిరెడ్డి పద్మమ్మ మృతి చెందారు. వృద్దాప్యం , అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా భాదపడుతూ వారి స్వగ్రామం ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడులో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి కిషన్​ రెడ్డి తల్లిని, ప్రశాంత్​ రెడ్డి నానమ్మను తలుచుకోని కంటతడిపెట్టారు. సీఎం కేసీఆర్​, రాష్ట్ర మున్సిఫల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​, వైద్యారోగ్యా శాఖ మంత్రి హరీష్​లు మంచిరెడ్డి పద్మమ్మకు సంతాపం ప్రకటిస్తూ కిషన్​ రెడ్డికి, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని సందేశం పంపారు.

శుక్రవారం ఎమ్మెల్యే స్వగ్రామమైన వెలిమినేడులో జరిగిన అంత్యక్రియల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, కాలె యాదయ్య, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, యెగ్గె మల్లేశం, జెడ్పి చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, మేడ్చల్ జెడ్పి ఛైర్మెన్ మెలిపెద్ధి శరత్ చంద్రారెడ్డి, అడిషనల్ డిజిపి బత్తుల శివధర్ రెడ్డి, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీలు సిహెచ్ శ్రీనివాస్, సాయిశ్రీ , మాజీ ఎమ్మెల్యేలు కోదండరెడ్డి, మెలిపెద్ధి సుధీర్ రెడ్డి, కోదండ రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి , రెడ్కో చైర్మెన్ సతీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ బుయ్యని మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్తు వెంకటరమణారెడ్డి, డిసిఎంఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి , వైస్ చైర్మెన్ సత్తయ్య , క్యామ మల్లేశ్ , రైతుబంధు చైర్మెన్ వంగేటి లక్ష్మారెడ్డి , బీఆర్ఎస్ , సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ నాయకులు , నియోజకవర్గ ప్రజలు, అధికారులు, బంధుమిత్రులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Next Story

Most Viewed