ప్రజల గుండెల్లో కేసీఆర్ ది సుస్థిర స్థానం..

by Disha Web Desk 20 |
ప్రజల గుండెల్లో కేసీఆర్ ది సుస్థిర స్థానం..
X

దిశ, యాచారం : తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకంగా మేలు చేసిన కేసీఆర్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. మండలం, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష , కార్యదర్శులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనునట్లు చెప్పారు.

ఈనెల 25న మన్నెగూడలోని వేద ఫంక్షన్ హాల్లో నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి గ్రామం నుంచి ఎంపిక చేసిన 50 మంది ముఖ్య కార్యకర్తలతో పాటు పార్టీ క్రియాశీల సభ్యులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరవ్వాలని సూచించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అభివృద్ధి సంస్థాగత నిర్మాణం ఏడాది పాటు కార్యక్రమాల పై ఈ సమావేశంలో చర్చించి కార్యచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి , ఎంపీపీ నర్మద, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ , పార్టీ మండల , మున్సిపల్ అద్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు తదితరుల పాల్గొన్నారు.

Next Story

Most Viewed